అనంతపురం జేఎన్టీయూలో సీనియర్ల ర్యాగింగ్ శృతిమించింది. అర్ధరాత్రిలో జూనియర్లను హాస్టల్ కు రప్పించి అర్థ నగ్నంగా డ్యాన్స్ లు చేయిస్తున్నారు. సిగరెట్లు, మందు లు తీసుకురావాలని బెదిరిస్తున్నారు. వేధింపులు భరించలేక జూనియర్లు ప్రిన్సిపల్ సుజాతకు ఫిర్యాదు చేశారు. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన 12 మంది విద్యార్థులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జె ఎన్ టీ యు చరిత్రలో ఇంతమంది సస్పెండ్ చేయడం ఇదే తొలిసారని అధికారులు తెలియజేసారు.