ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్​ అభిమానులకు శుభవార్త

international |  Suryaa Desk  | Published : Mon, Feb 07, 2022, 01:41 PM

టీ20 ప్రపంచకప్​-2022 ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ​​ టికెట్లను అమ్మకానికి ఉంచినట్లు ఐసీసీ తెలిపింది. ఈ టికెట్​ ధరలను పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు పేర్కొంది. t20worldcup.com వైబ్​సైట్​లో సోమవారం నుంచి టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.


వరల్డ్ కప్ టోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. 7 మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్​లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్​బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాల్లో టీ20 ప్రపంచ కప్​ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్​, నవంబర్ 13న మెల్​బోర్న్​ క్రికెట్ మైదానంలో జరగనుంది. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న నిర్వహించనున్నారు. టీ20 ప్రపంచకప్ ​నకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com