చెన్నై : తమిళనాడులోని తిరువేర్కాడు సబర్బన్లో శుక్రవారం తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీజేపీ నేత పద్మనాభన్(48) ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి చేశారు. పద్మనాభన్ నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబు దాడికి ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న సోఫా, కుర్చీలతో పాటు ఇతర వస్తువులు కాలిపోయాయి. పద్మనాభన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.