కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 27 నగరాల్లో ఇప్పటికే ఉన్న నైట్ కర్ఫ్యూని ఫిబ్రవరి 4 వరకు పొడిగిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. గాంధీనగర్లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.