కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మనవరాలు సౌందర్య శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.బెంగళూరులోని వసంతనగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న యడియూరప్ప మనవరాలు ఉరి వేసుకుంది. ఆమె బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు.యడ్యూరప్ప మనవరాలి అంత్యక్రియలు బెంగళూరు శివార్లలోని ఫామ్హౌస్లో ఈరోజు నిర్వహించే అవకాశం ఉంది.హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.ఘటన జరిగినప్పుడు సౌందర్య తల్లిదండ్రులు హుబ్లీలో ఉన్నారు.