ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీసీ వీమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన ఎంపిక

national |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 06:05 PM

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు సముచిత గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గానూ ఆమె ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీన్లలో భాగంగా భారత్ కేవలం రెండే మ్యా చ్ లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాల్లోనూ ఓపెనర్ స్మృతి కీలక పాత్ర పోషించింది. రెండో వన్డేల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె... చివరి టీ20 మ్యాచ్ లో 48 పరుగులు చేసింది. అదే విధంగా.... ఇంగ్లండో టెస్టు మ్యాచ్ లో 78 పరుగు లు సాధించిన ఆమె... మ్యాచ్ డ్రా కావడంలో తన వంతు పాత్ర పోషించింది. అంతేగాక భారత్ గెలిచిన ఏకైక వన్డే సిరీస్లో 49 పరుగులతో రాణించింది. ఇక టీ20 సిరీస్లో భాగంగా 15 బంతుల్లో కీలకమైన 29 పరుగులతో పాటు అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటింది. అంతేగాక ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో స్మృతి మంధాన 86 పరుగులు చేసింది. ఇక కంగారూ లతో జరిగిన ఏకైక టెస్టులో సెంచరీ సాధించింది. ఇలా పలు మ్యాచ్ లో అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న స్మృతిని ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ది ఇయర్‌గా ఎంపిక చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com