ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంద్రా లో కొత్తగా 13,819 కరోనా కేసులు.. 12 మంది మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 25, 2022, 05:28 PM

ఆంద్రా లో  గడచిన 24 గంటల్లో 46,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు కాగా, ప్రకాశం జిల్లాలో 1,589 కేసులు, గుంటూరు జిల్లాలో 1,422 కేసులు, అనంతపురం జిల్లాలో 1,345 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,305 కేసులు, కర్నూలు జిల్లాలో 1,255 కేసులు, కడప జిల్లాలో 1,083 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 1,001 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,561కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,08,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,92,998 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. ఏపీలో ప్రస్తుతం 1,01,396 మంది చికిత్స పొందుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com