నిన్న కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులకు లోనైన మార్కెట్లు... చివరి గంటలో లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 367 పాయింట్లు లాభపడి 57,858 వద్ద ముగిసింది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 17,278 వద్ద కొనసాగుతోంది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
మారుతీ సుజుకీ (6.88%), యాక్సిస్ బ్యాంక్ (6.76%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.87%) మరియు భారతీ ఎయిర్టెల్ (3.23%).
టాప్ లూజర్స్:
విప్రో (-1.75%), బజాజ్ ఫిన్సర్వ్ (-1.16%), టైటాన్ (-0.98%), ఇన్ఫోసిస్ (-0.85%), టెక్ మహీంద్రా (-0.80%).