ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పీఆర్సీపై ఈనెల 27న మరోసారి చర్చలకు రావాలని కార్మిక సంఘాలను కోరామని.. ఉద్యోగుల కోసం మంత్రుల కమిటీ ఎదురుచూస్తోందన్నారు. ఆలస్యంగా యూనియన్ నాయకులు వస్తారేమోనని మంత్రుల ఎదురు చూస్తున్నారని తెలిపారు. జీవోలను నిలిపివేయాలని సంఘాలు డిమాండ్ చేశాయన్నారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు సజ్జల. ఏదీ దాచుకోకుండా, ఏదీ అడక్కుండానే సీఎం అన్నీ ఇచ్చారన్నారు. ఈ పీఆర్సి ప్రక్రియను తిప్పికొట్టడం సరికాదని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఎలాంటి మార్పులు చేసి మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సజ్జల తెలిపారు.