ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ వేదికల మార్పు

sports |  Suryaa Desk  | Published : Sat, Jan 22, 2022, 11:31 PM

భారత్ లో కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. మూడు వన్డేలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయని, మూడు టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇదిలావుంటే ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే భారత్ లో కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com