ఏపీ లో జగన్ ప్రభుత్వం దివాళా తీసింది, అంటూ బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవని, మద్యం, ఇసుక మాఫియా వల్ల ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా జీతం పెంచకుండా తగ్గించిందని విమర్శించారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్న ప్రజలకు న్యాయం జరగాలన్నారు. ఏపీ లో 1వ తేదీన జీతం లేదు.. పెన్షన్ లేదు.. ఏపీలో ఖజానా ఖాళీ చేసారు అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అరికట్టేందుకు తాను అండగా ఉంటానని వ్యాఖ్యానించారు. భాజపా కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించమని, శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.