శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ 2020 నాటికి 50 నుంచి 70 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తుందని కేంద్రం సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. హరియాణాలో డిజిటల్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ఆయన.. కేంద్రప్రభుత్వ పథకాల అమలుకు నూతన సాంకేతికతను ఉపయోగించుకుని నిరుపేద యువతకు ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. చిన్న పట్టణాల్లో బీపీఓల ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలను కల్పించడం ద్వారా గ్రామీణ యువతకు చేయూతనివ్వనున్నట్లు తెలిపారు.