దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,38,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 310 మంది వైరస్ మృత్యువు బారిన పడ్డారు. అంతకుముందు రోజుతో పోలిస్తే కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,071 తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 94 శాతం.