ఏపీలో కరోనా ప్రతాపం చూపుతోంది. తాజాగా బెజవాడ కనక దుర్గమ్మ గుడిలో కరోనా కలకలం రేపింది. ఆలయ పూజార్రుల్లో ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు అంతరాలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఆలయ వేళల్లోనూ అధికారులు మార్పులు చేశారు. పండగ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.