కేరళలోని తిరువనంతపురం జిల్లా అరువిక్కర రోడ్డులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ముగ్గురు విద్యార్థులు బైక్పై వెళ్తున్నారు. బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ముగ్గురూ చనిపోయారు. ముగ్గురు విద్యార్థులను బినీష్ (16), స్టెఫిన్ (16), ముల్లప్పన్ (16)గా గుర్తించారు.