ఉగ్రవాదులకు నిధులను పంపిస్తూ, మనీలాండరింగ్కు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్లోని పాక్ ప్రైవేటు బ్యాంకు హబీబ్ బ్యాంక్ లిటిటెడ్( హెచ్బీఎల్) బ్రాంచ్ను మూసివేయాల్సిందిగా న్యూయార్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను డీఎఫ్ఎస్ విడుదల చేసింది. బ్యాంకింగ్ చట్టాలను ఉల్లంఘించి లావాదేవీలు జరిపినందుకు గానూ, బ్యాంకింగ్ రెగ్యులేటరీ హెచ్బీఎల్కు 225 మిలియన్ డాలర్లు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది. తొలుత 629.6 మిలియన్ డాలర్లు జరినామా చెల్లించాల్సిందిగా డీఎఫ్ఎస్ ప్రతిపాదించినప్పటికీ చివరికి 225 మిలియన్డాలర్లు చెల్లించాలని తెలిపింది.