రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి ప్రామాణికంగా ఉండే కడప- బెంగళూరు రైలు మార్గం పూర్తి విషయంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పేర్కొన్నారు. వేంపల్లెలో ఆయన మీడియాతో రైల్వే లైన్ పూర్తి కాకపోవడం లో వైసీపీ లో ప్రభుత్వ అసమర్థత ఉందని ఆయన విమర్శించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.