వైఎస్ఆర్ కడప జిల్లా, వల్లూరు మండలం దుగ్గాయపల్లె పాపాగ్ని నదిలో కొట్టుకు పోయి వృద్దుడు మృతి చెందారు. మృతుడు దుగ్గాయపల్లె ఎస్సీ కాలనీకి చెందిన చాగలమర్రి పుల్లయ్య (70)గా గుర్తించారు. బుధవారం ఉదయం వరద ఉధృతి తగ్గిందని అటువైపు ఉన్న పొలాల్లోకి వెళ్లడానికి నది దాటుతుండగా వరద ఉధృతికి ముగ్గురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వారిలో ఇద్దరు గట్టుకు చేరుకోగ ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.