మహారాష్ట్రలో మద్యం సేవిస్తూ చిన్న వివాదంలో తమ స్నేహితుడిని హత్య చేసినందుకు, ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక అధికారి తెలిపారు. మహారాష్ట కాల్వా ప్రాంతంలోని ఇందిరా నగర్ ప్రాంతంలో గురువారం-శుక్రవారం మధ్య రాత్రి ఈ సంఘటన జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకట్ అందాలే తెలిపారు.
శుక్రవారం ఉదయం 22 ఏళ్ల గులాబ్ సలామత్ షేక్ మృతదేహం పలు గాయాలతో కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి, అప్పటి గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 (హత్య), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించడం మరియు మద్యం కోసం డబ్బులు చెల్లింపు విషయంలో వివాదం కారణంగా బాధితుడిని అతని స్నేహితులు హత్య చేసినట్లు పోలీసులకు తరువాత తెలిసింది, ముగ్గురు నిందితులను ఆకాష్ కిసాన్ పలాష్ (20), సన్నీ ధను సోంకర్ (23), ఫైజల్ ఫైయాస్ ఖాన్ (24)గా గుర్తించి శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు.