కృష్ణా జిల్లాలో మోపదేవి గ్రామానికి చెందిన పెంజర్తి వెంకటేశ్వరావు తన భార్యతో కలిసి బుధవారం ఉదయం పెదపులికుర్రు వంతెనపై వస్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న బైక్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో వెల్లటూరు-పెనుమూడి రహదారిలో వస్తున్నా లారీ కిందకు వెళ్లిపోయారు. ఈ ఘటనలో వెంకటేశ్వరావు గాయాలు కావడంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక లారీ నెమ్మదిగా వెళ్తుండడంతో దంపతులు పెను ప్రమాదం నుండి భయపడ్డారు.