ఢిల్లీలోని అన్ని పాఠశాలలు నవంబర్ 29 నుండి అన్ని తరగతులకు తిరిగి ప్రారంభం అవుతున్నాయి అని ఢిల్లీ విద్యా మంత్రి మనీష్ శనివారం తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఇతర విద్యా సంస్థలతో పాటు సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు మూసివేయబడిన తరువాత ఢిల్లీలోని పాఠశాలలు 9 నుండి 12 తరగతుల విద్యార్థుల కోసం తిరిగి ప్రారంభం కానున్నాయి అని ట్విట్టర్ ద్వారా మంత్రి మనీష్ తెలిపారు.