వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం మైదుకూరు మండలం బద్వేల్ రోడ్ లోని కూడలి వద్ద గల పోలీస్ చెక్ పోస్ట్ వద్ద మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ వాహన తనిఖీ చేస్తుండగా భారీ మొత్తంలో కారులో తరలిస్తున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే. మైదుకూరు అర్బన్ సీఐ చలపతి కి రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఈ భారీ అక్రమ మద్యం పట్టుబడింది. అక్రమ మద్యం వివరాల్లోకి వెళితే ఓల్డ్ అడ్మిరల్ (1 లీటర్) మద్యం20 , సిల్వర్ కప్ బాటిల్(180 ఎమ్మెల్ )759 బాటిళ్లు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 1, 50, 000 ఉన్నట్లు, కారు విలువ నాలుగు లక్షల పైబడి ఉన్నట్లు మొత్తం ఆరు లక్షలు వరకు ఉండవచ్చునని పోలీసులు అంచనా వేశారు.
ఈ అక్రమ మద్యం కేసు యొక్క వివరాల్లోకెళితే. కడప సిటి, అప్సర సినిమా హాల్ దగ్గర ఉన్న మణిరత్నం అనే ముద్దాయి కర్నాటక రాష్ట్రం బెంగుళూరు నుండి కొనుగోలు చేసి తెచ్చిన అక్రమ మద్యం బాటిల్ లను ముద్దాయిలైన సయ్యద్ తన్వీర్ అలియాస్ మున్నా మరియు వులితల చంద్రశేఖర్ లకు మద్యం బాటిల్ లు కలిగిన కే ఏ 04 ఏ ఏ 5740 నంబరు గల వాహనం ను కడప సిటి లోన ఐ టి ఐ వద్ద అప్పగించగా, అతని ఆదేశాల మేరకు గోపవరం మండలం పి పి కుంట కు తీసుకుని వెళ్ళి అతను ఫోన్ చేసి చెప్పిన వ్యక్తి కి అందచేయమని చెప్పగా, వాటిని సదరు ఇద్దరు ముద్దాయిల కే ఏ 04 ఏ ఏ 5740 నంబరు గల కారు లో అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడినారు. పరారీలో ఉన్న మణిరత్నం ను అరెస్ట్ చేయవలసి ఉన్నది.