న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సుప్రీంలో చుక్కెదురైంది. ఈ నెల 23న సీబీఐ ఎదుట హాజరు కావలసిందిగా సుప్రీం కోర్టు ఆయనను ఆదేశించింది. అవినీతి, మనీలాండరింగ్ కేసులో సీబీఐ ఎదుట ఈ నెల 24న హాజరు కావలసిందిగా కార్తి చిదంబరంను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది. తనతో పాటు న్యాయవాదిని కూడా తీసుకువెళ్లేందుకు సుప్రీం కోర్టు కార్తి చిదంబరానికి అనుమతి ఇచ్చింది. ఆగస్టు 23 నుంచి 28 వరకూ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చిదంబరాన్ని విచారించడానికి సీబీఐకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.