ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిటాల సునీత సంచలన కామెంట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 22, 2021, 12:03 PM

మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓకే అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనన్నారు. చంద్రబాబు ఇకనైనా మారాలని, ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుందని వైసీపీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు. తమదీ సీమ రక్తమేనని, తమకు బీపీ వస్తుందని పరిటాల సునీత ప్రస్తుతం ఏపీలో జరుగుతోన్న రాజకీయ రగడపై వ్యాఖ్యానించారు.


అటు, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సైతం ఇవాళ మండిపడ్డారు. తమ నేతలపై ఏపీ మంత్రులు బూతు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము ఏపీలో అధికారంలోకి వస్తామని, జగన్ రెడ్డి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోన్న ఏపీ మంత్రులతో పాటు అందరినీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే తరిమి కొడతామని తెలిపారు. ఎన్నో కేసుల్లో జగన్ ముద్దాయిగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.


ఏపీలోని 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయి గురించి తాము చెబుతోంటే దాన్ని పక్కదారి పట్టించడానికే తమ కార్యాలయాలు, ఇళ్లపై దాడులు జరుపుతున్నారని దేవినేని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ధరలను పెంచేశారని, ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.కాగా, తిరుపతిలో వైసిపి జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడే కట్టి శవయాత్ర నిర్వహించారు వైసీపీ కార్యకర్తలు. సెంట్రల్ పార్క్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దాకా దిష్టిబొమ్మను ఉరేగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com