అగ్రకుల అహంకారంతోనే రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ అడ్డ గలా అంబెడ్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దళితుల పై మంత్రి తన మాటలతో విషం కక్కారని రిజర్వేషన్ లు దళితులకు 10 ఏండ్లుమాత్రమే అన్నది శుద్ధ అబద్దమని, దళితులకు ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 ద్వారా ఈ దేశంలో రిజర్వేషన్ లు ఇవ్వబడ్డాయని,
ఇక పదేళ్లే అని అపోహ పడ్డవి దళితుల రాజకీయ రిజర్వేషన్ లు మాత్రమే అని తెలిపారు. ఆర్టికల్ 335 ద్వారా దళితులకు ప్రమోషన్ లలో అవకాశం రాజ్యాంగ సవరణద్వారా ఇవ్వబడుతున్నాయని ,రిజర్వేషన్ లు ఉద్యోగ ,విద్య అవకాశాలు ఈ దేశం లో దళితుల ప్రాధమిక హక్కు గా ఉన్నాయనరు. రిజర్వేషన్ లు ,రాజ్యాంగo తెలియక పోవడం ఆయన అజ్ఞానికి నిదర్శనమని .ఆయన మాటలు కుల గజ్జికి నిదర్శనమని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. వెంటనే ఆదినారాయణ రెడ్డి దలితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.