గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఉమ్మిడిపాలెంలో నిన్న బోరుబావిలో పడి సురక్షితంగా బయటపడిన బాలుడు చంద్రశేఖర్ కు అందిస్తున్న వైద్య చికిత్సలపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పది గంటల పాటు బోరుబావిలో ఉన్న కారణంగా బాలుడు డీహైడ్రేషన్ కు గురయ్యాడనీ, అందుకే సెలైన్ ఎక్కిస్తున్నారనీ వివరించారు. బాబు ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. ఈ సాయంత్రానికి బాబును డిశార్జి చేస్తున్నాట్లు మంత్రి తెలిపారు. బోరు బావి సంఘటనలపై హై లెవల్ కమిటీ సమావేశం ఈ ఘటనలో బాలుడిని కాపాడిన సిబ్బందిని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అభినందించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పది గంటల పాటు శ్రమించి బాలుడిని సురక్షితంగా బోరుబావినుంచి బయటకు తీసుకువచ్చి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఆయన అభినందించారు. బోరుబావి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు