ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాకు షాకిచ్చేందుకు సిద్ధమౌవుతున్న ఇండియా !

international |  Suryaa Desk  | Published : Tue, Oct 19, 2021, 02:06 PM

చైనాకు గట్టిగా బుద్ది చెప్పేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ లోయ దగ్గర ఘర్షణల్లో మన సైన్యంపై ఆయుధాలతో డ్రాగన్‌ మూకలు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలుసు. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ సైన్యం ఇప్పుడు కొత్త ఆయుధాలను సమకూర్చుకుంది. సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్నకారణంగా ప్రాణహాని లేని ఆయుధాలు తయారుచేయిస్తోంది. ''గతేడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు, టేసర్‌లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదులిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహానిలేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి.


భద్రతా బలగాలకు ఈ ఆయుధాలు అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. 'వజ్ర' పేరుతో మెరుపులతో కూడిన మెటల్‌ డివైజ్‌ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను పంక్చర్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు. సప్పర్‌ పంచ్‌ పేరుతో తయారుచేసిన గ్లౌజ్‌ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి'' '' అని మోహిత్‌ వివరించారు. అయితే, భారత బలగాలు ఈ ఆయుధాలు తయారుచేయాలని ఎప్పుడు తమను అడిగాయన్న అంశంపై మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఈ ఆయుధాలను ప్రైవేటు వ్యక్తులు, సామాన్య ప్రజలకు మాత్రం విక్రయించబోమని తేల్చి చెప్పారు. భద్రతా బలగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు మాత్రమే విక్రయించనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ ఆయుధాలు భద్రతా బలగాల కోసం తీసుకొంటున్నట్టు ప్రభుత్వం/సాయుధ దళాల ప్రతినిధుల నుంచి అధికారిక ప్రకటన కూడా ఏమీలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com