కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేయడం జరిగిందని టీటీడి తెలిపింది. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోందని పేర్కొంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతోందని, అనేకమంది అది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉందని, భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్శనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయనున్నట్లు టిటిడి కోరుతోంది.