కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో కాలం చెల్లిన మద్యం అమ్మకం కలకలం రేపింది. వెంకటనరసింహపురంలోని ప్రభుత్వ మద్యం షాపు సిబ్బంది కాలం చెల్లిన బీర్లు విక్రయించారని మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేంటని షాపు సిబ్బందిని మందుబాబులు ప్రశ్నించారు. దీంతో తప్పు తెలుసుకున్న మద్యం షాపు సిబ్బంది తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేశారు.