ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,592 కరోనా పరీక్షలు నిర్వహించగా 771 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల 8 మంది మరణించగా.. 1,333 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కడప, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ 12, చిత్తూరు 153, తూర్పు గోదావరి 104, గుంటూరు 89, వైఎస్ఆర్ కడప 29, కృష్ణ 76, కర్నూల్ 4, నెల్లూరు 92, ప్రకాశం 83, శ్రీకాకుళం 13, విశాఖ పట్నం 42, విజయనగరం 0, పశ్చిమ గోదావరి 74.