స్నేహం అనే పదాన్ని అడ్డుపెట్టుకొని ఓ కారును ఎత్తుకెళ్లారు ఓ ఇద్దరు వ్యక్తులు. ప్రకాశం జిల్లా టంగుటూరు శ్రీనివాసనగర్కు చెందిన గ్రంధి హరిబాబు, అలాగే ఈపూరు మండలం బోడెపూడివారిపాలేనికి చెందిన కొల్లి లక్ష్మణరావులను అరెస్టు చేశారు. శుక్రవారం అరండల్పేట స్టేషన్లో సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అరండల్పేట సీఐ నరేష్కుమార్ కథనం మేరకు.. బ్రాడీపేటకు చెందిన చీమకుర్తి కిరణ్కుమార్ సున్నం వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు కొంతకాలం క్రితం హరిబాబు, లక్ష్మణరావులు పరిచయం అయ్యారు. లక్ష్మణరావు కార్లు అద్దెకు తిప్పుతూ ఉంటాడు. కిరణ్కుమార్ గత ఏడాది ఫోర్డ్ పీకో కారును కొనుగోలు చేశాడు. ఈ ఏడాది జనవరి 28న తన ముందు పార్క్ చేసిన కారు కనిపించలేదు. స్నేహితులపై అనుమానంతో అరండల్పేట స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.