తమిళనాడు 26వ గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ పని చేసిన భన్వరీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ అవగా.. ఆయన నాగాలాండ్ నుంచి తమిళనాడుకు వచ్చారు. శనివారం రాజ్భవన్లో గవర్నర్తో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో సీఎం ఎంకే స్టాలిన్, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేత కే పళనిస్వామి, తదితరులు పాల్గొన్నారు.