ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్లకు సీబీఐ, ఈడీ కోర్టు వారెంట్ను జారీ చేసింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డి, రాజగోపాల్పై సీబీఐ, ఈడీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ఈడీ కేసుల విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టే లేనందున విచారణకు షెడ్యూల్ ఖరారు చేయాలని కోర్టును ఈడీ కోరింది. వాన్పిక్, దాల్మియా, జగతి పబ్లికేషన్స్, రాంకీ కేసుల విచారణను కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది.