ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల నియామకం ఖరారైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ వారిని ఈ బోర్డులో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ కు సిఫార్సు చేసారు. రెండో సారి వరుసగా వైవీ సుబ్బారెడ్డిని ఛైర్మన్ గా నియమించిన తరువాత బోర్డును సైతం వెంటనే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ దిశగా టీటీడీ బోర్డు కొత్త పాలక వర్గం ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. దీనికి సంబంధించిన తుది జాబితా విడుదలైంది. 25మంది సభ్యుల జాబితాలో పొలకాల అశోక్, మల్లాడి కృష్ణారావు, జూపల్లి రామేశ్వరరావు, మారుతి, జీవన్రెడ్డి, పార్థసారథి రెడ్డి, జే శ్రీనివాసన్, రాజేష్ శర్మ, సౌరభ్, కన్నయ్య, మూసారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్, నందకుమార్, ఆడిటర్ సనత్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ కేతన్ దేశాయ్, లక్ష్మీనారాయణ, మిలింద్, శశిధర్, శంకర్, విశ్వనాథ్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, గోర్ల బాబూరావు, రాంభూపాల్ రెడ్డి పేర్లు ఉన్నాయి.