గుంటూరు: పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ సెంటర్ లో గుర్రం జాషువా విగ్రహం ఎదురుగా రోడ్డు ప్రమాదం సంభవించింది. పట్టణానికి చెందిన వ్యక్తి గుగులోతు నరసింహ నాయక్(60) లారీ మీద నుండి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గూగుల్ లోతు చిన్న నరసింహ నాయక్ పిడుగురాళ్ల ఎంపీడీవో కార్యాలయం వెనకాల ఎస్సీ, ఎస్టీ బాలికల హాస్టల్ లో తన మనవరాలు అడ్మిషన్ కొరకు వెళ్లి వస్తూ తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. నరసింహారావు నాయక్ పిడుగురాళ్ల ఆంధ్ర బ్యాంక్ వెనకాల నివాసం ఉంటున్నాడు.