ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 01:45 PM

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శని రామచంద్ర (36)పార్వతీపురం మండలం కేంద్రం కొత్తవలస విజయరామకాలనీలో నివాసము ఉంటున్నారు. ఇదిలావుంటే రామచంద్ బహిర్భూమికి వెళ్ళగా తనకాలనీ సమీపంలో గల రైల్వేట్రాక్ వద్దకు వెళ్ళగా అదే సమయంలో పార్వతీపురం నుండి రాయగడ వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మురళి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com