కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందని మంత్రి చినరాజప్ప తెలిపారు.ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలో రేపు నిర్ణయిస్తామన్నారు. కాకినాడ మేయర్ పదవి కాపులకే ఇస్తామని ఆయన తెలిపారు. జగన్, బొత్స మనస్తత్వాలు ఒకటే అని ఆయన అన్నారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు చేశారని చెప్పారు. పాదయాత్రపై, కాపు రిజర్యేషన్లపై ముద్రగడకు చిత్తశుద్ధి లేదన్నారు. పాదయాత్రకు అనుమతిస్తామన్నా ముద్రగడ తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఉనికి కోసం కాపులను ఇబ్బందిపెట్టడమే ముద్రగడ వ్యూహమని ఆయన ఆరోపించారు. ముద్రగడకు వైసీపీ వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు.