పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పెడకడిమి గ్రామానికి చెందిన గంచి సురేష్ 44 భార్య ధనలక్ష్మితో రాత్రి గొడవ పడుతుండగా, పక్కింటి రవి అడ్డు వెళ్ళాడు. రవి పై సురేష్ దాడి చేయడంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహించిన రవి కత్తితో సురేష్ పై దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు సురేష్ మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.