మేఘాలయ స్వతంత్ర ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ శుక్రవారం కరోనాతో కన్నుమూశారు. అంతక్రితం మంగళవారమే ఆయనకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ నేపధ్యంలోనే శుక్లా ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ మావంగాప్లోని స్వగృహంలో సున్ కన్నుమూశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ కరోనా వ్యాక్సీన్ తీసుకోలేదు. ఇతని మాదిరిగానే మరో ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు. 2016లో రాజకీయాల్లో కాలుమోపిన ఆయన 2018లో మావ్ఫలంగ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొంది, ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే సింటార్ క్లాస్ సున్ మృతికి మేఘాలయ ముఖ్యమంత్రి కొనరాడ్ సంగ్మా సంతాపం వ్యక్తం చేశారు.