నంద్యాల సభతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైందని ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ను నోటికి వచ్చినట్లుగా టీడీపీ నేతలు తిట్టారని ఆరోపించారు. జగన్ను సైకో, ఉన్మాది, అంతుచూస్తా అంటూ మాట్లాడారన్నారు. టీడీపీకి బుద్ధి చెప్పడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చుతామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలను నిట్టనిలువున ముంచింది నిజం కాదా అని అన్నారు. జగన్ను విమర్శించే అర్హత అఖిలప్రియకు లేదన్నారు. తల్లిదండ్రుల కంటే అఖిలప్రియకు పదవులే ముఖ్యమని ఆరోపించారు. చంద్రబాబు కేబినెట్లో అఖిలప్రియ మరో లేడీ పప్పు అని విమర్శించారు.