పెరిగిపోయిన టెక్నాలజీ ఏరూపంలో ప్రాణం తీస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా ప్లూటూత్ హెడ్ ఫోన్స్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటన జరగడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. జైపూర్ కు చెందిన రాకేశ్ అనే యువకుడి బ్లూటూత్ హెడ్ ఫోన్ పెట్టుకుని ఫోన్ మాట్లాడుతుండగా అవి అకస్మాత్తుగా పేలిపోయాయి. రాకేశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇయర్ ఫోన్స్ పేలిన సమయంలో గుండెపోటు రావడంతో మరణించి ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు.