ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 02, 2021, 02:40 PM

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారీతిన దోచుకుంటోందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ ఆరోపించారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో పరిశీలన చేయనున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇసుక, మైనింగ్ లో వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. అక్రమ మైనింగ్‌పై టీడీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉందని స్పష్టం చేశారు. ప్రశ్నించిన దేవినేనిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఉందని, అక్రమ అరెస్టులకు టీడీపీ భయపడదని టీడీపీ నేత బోండా ఉమ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com