ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

national |  Suryaa Desk  | Published : Mon, Aug 02, 2021, 09:37 AM

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. వీటిలో రైతులకు ప్రత్యేక స్కీమ్‌ కూడా ఉంది. అదే ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా ఎంతో మంది రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు. ఈ స్కీమ్‌ కింద అర్హులైన రైతులకు వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. పీఎం కిసాన్ స్కీమ్‌ కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున లభిస్తున్నాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా విడతల వారీగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఒక్కో విడత కింద రూ.2 వేల చొప్పున రైతుల అందుతున్నాయి. దీంతో ఏడాదికి మూడు సార్లు రైతులకు డబ్బులు అందుతున్నాయి.


ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం రైతులకు 8వ విడత డబ్బులు అందించింది. ఇప్పుడు 9వ విడత డబ్బులు రావాల్సి ఉంది. అయితే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు ఏ తేదీన జమ అవుతాయన్న విషయం క్లారిటీ లేకపోగా, ఆగస్టు నెలలో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. పీఎం కిసాన్‌ స్కీమ్‌ కింద ఈనెలలో రైతులకు రూ.2 వేలు లభిస్తాయి.


 


ఇంకా ఎవరైనా ఈ పథకంలో చేరకపోతే ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా ఆన్‌లైన్‌లోనే మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. లేదా మీ సేవకు వెళ్లి కూడా ఈ పనిని పూర్తి చేసుకోవచ్చు. గత కొంత కాలంగా వెబ్‌సైట్‌లో న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పని చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్ పని చేస్తోంది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, పొలం పట్టా వంటి వివరాలతో స్కీమ్‌లో చేరితే డబ్బులు వస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com