విజయనగరం జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ కిలాడీ లేడి యువతను మోసం చేసి రూ. లక్షలు కొట్టేసింది. విజయనగరం జిల్లా రాముడు వలస గ్రామానికి చెందిన గుంటా విజయరాణి అనే మహిళ మంత్రులు, ఉన్నతాధికారుల పేర్లు చెప్పి, యువతకు ఉద్యోగాల ఎరచూపింది. సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతోంది. నిన్న రాత్రి విజయరాణి ఉన్నట్టుండి బొబ్బిలిలో ప్రత్యక్షమైంది. దీంతో బాధితులు తమ డబ్బు తిరిగి చెల్లించాలంటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాయలేడీ విజయరాణిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.