నెల్లూరు ఏసీ నగర్లో రోడ్డుపై చాక్లెట్స్, ప్రోటీన్ ప్రొడక్ట్స్ కుప్పులు తెప్పలుగా కనిపించాయి. లోడ్ తీసుకెళ్తుండగా పడిపోయాయని అందరూ భావించారు. దీంతో వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. చేతికందినన్ని తీసుకున్నారు. కొందరైతే సంచుల్లో నింపుకున్నారు. చిన్న పిల్లలయితే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరకుని వాటిని ఇంటికి తీసుకెళ్లారు. అయితే అవి ఎక్స్పైరీ అయిన చాక్లెట్స్ అని తర్వాత తెలిసింది. డేట్ ముగిసిపోవడంతో గోదాం నుంచి తీసుకొచ్చి నడి రోడ్డుపై ఈవిధంగా పడేసి వెళ్లారు. ఆ విషయం తెలియడంతో కొందరు వాటిని తిరిగి అక్కడే పడేశారు.కాలం చెల్లిన చాక్లెట్లు కావడంతో మున్సిపల్ అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వాటిని ఎవరూ తినవద్దని, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.