ఇటలీకి చెందిన సూపర్ కార్ల ఉత్పత్తుల సంస్థ ఫెరారీ నుంచి రెండు కొత్త కార్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫెరారీ జీటీసీ4లూసో, జీటీసీ4లూసో టీ మోడళ్లను సంస్థ నేడు విడుదల చేసింది. లూసో అనేది ఇటాలియన్ పదం. దాని అర్థం లగ్జరీ. అందుకే లూసో పేరుతో ఈ సరికొత్త కార్లను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. ఈజీటీసీ 4లూసో ధర రూ. 5.20కోట్లు(ఎక్స్ షోరూం), జీటీసీ4లూసో టీ ధర రూ. 4.20కోట్లు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది.
6.2 లీటర్ల వీ12 ఇంజిన్తో జీటీసీ4లూసోను తయారుచేశారు. ఈ ఇంజిన్ 681బీహెచ్పీ, 697 ఎన్ఎం పీక్ టార్క్ను ఉత్పత్తి చేయగలదు. 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ ఉంటుంది. జీటీసీ4లూసో టీ 3.9లీటర్ల వీ8 ఇంజిన్ కలిగి ఉంది. ఇది 610 బీహెచ్పీ పవర్, 760ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్లో కూడా 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ గేర్బాక్స్ను ఏర్పాటుచేశారు.