బీల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణకు నిరాశ ఎదురైంది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో ఓటమితో అతడు టైటిల్ను చేజార్చుకున్నాడు. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంతో ఉన్న హరికృష్ణ.. ఆఖరి రౌండ్లో ఫ్రాన్స్కు చెందిన బార్కోట్ ఎతీనె (6) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆఖరి రౌండ్లో నెగ్గిన హు ఇఫాన్ (చైనా) 6.5 పాయింట్లతో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. హరికృష్ణ మూడో స్థానంతో సంతృప్తి చెందాడు.