నేటి సమాజంలో చాలా మంది మనుషులను కంటే జంతువులోనే ఎక్కువగా నమ్ముతుంటారు. ఇక మనషులకంటే పెంపుడు జంతువుల పై ప్రేమ చూపిస్తే అవి విశ్వాసంగా ఉంటాయని నమ్మిన వ్యక్తి. తాను కన్న కొడుకులాగా అప్యాయంగా పెంచుకున్న కుక్కు చనిపోతే 5 ఏళ్ల నుంచి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ తన ప్రేమ చాటుకుంటున్నాడు.
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అంపాపురంకి చెందిన సుంకర జ్ఞాన ప్రకాశరావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయనకు ఇద్దరు కుమార్తెలు ఉండుగా వివాహం చేసి అత్తారింటికి పంపిచాడు. కూతుళ్లు కాపురానికి వెళ్లి పోయారు దాంతో ఒంటరిగా ఉన్న సుంకర జ్ఞాన ప్రకాశరావు దంపతులు ఒక కుక్క పిల్లలు దొరికింది. కొడుకులు లేక పోవటం కుక్కనే కన్న కొడుకు లాగా అల్లారు ముద్దుగా సాకారు.
కుక్క కూడా జ్ఞాన ప్రకాశరావు దంపతులు సొంత వారిలా భావించేది. జ్ఞాన ప్రకాశరావు బయటకు వెళ్తే తిరిగివచ్చే వరకు అహారం ముట్టుకునేది కాదు. ఇంట్లో ఎవరికైనా జర్వం వస్తే వారికి తగ్గేవరకు ఏం తినేది కాదు. నీరసంగా ఉంటే మందులు దగ్గరకు తీసుకువచ్చి ఇచ్చేది.దంపతులు భోజనం చేస్తుంటే వారి కావాల్సిన కంచాలు నోటితో పట్టుకుని తీసుకువచ్చేది.
జ్ఞాన ప్రకాశరావుతో పాటు వ్యవసాయ పనులు కోసం పంటపొలాలకు వెళ్లేది. పశుగ్రాసం మేత కోసం బయటకు వెళ్లిన పశువుల, ఆవులు తప్పిపోకుండా కాపలా ఉండేది. కని పెంచిన తల్లిదండ్రులు పట్టించుకోని ఈ రోజుల్లో ఒక మూగ జంతువు ఇంత ప్రేమగా చూసుకోవటం ప్రకాశరావు తో చుట్టుపక్కల వారిని ఆశ్చర్యాన్ని గురిచేసింది.
అందుచేత జ్ఞాన ప్రకాశరావు కుక్క పై అంత అమితంగా ప్రేమను పెంచుకున్నాడు. సాటి మనిషి చనిపోతే పట్టించుకోని ఈ రోజుల్లో 5 ఏళ్ల క్రితం చనిపోయిన కుక్కకి కాంస్య విగ్రహం కట్టించి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బంధువులను, గ్రామస్తులను అహ్వనించి ఆల్ఫాహార విందు ఏర్పాటు చేశారు. ఆయనకు తన పెంపుడు జంతువు అంటే ఎంత ప్రాణమో ఇక్కడే తెలిసిపోతుంది.