కొవ్వురు నియోజకవర్గంలో తట్టు, రూబెల్లా కార్యక్రమాన్ని మంత్రి జవహర్ మంగళవారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ, 9 నెలల నుండి 15 సంవత్స్వరాల మధ్య పిల్లలకు తప్పని సరిగా ఈ టీకా వేయించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 8 వ తేదీ వరకు టీకా కార్యక్రమం జరుగుతుందన్నారు. 2020 లోపు రుబెల్లా వ్యాధి లేకుండా చేయాలనేది తెదేపా ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికి అనుగుణంగా విద్య,వైద్యశాఖ అధికారులు రుబెల్లా టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రుబెల్లా టీకా ను ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.