ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నావారికి ఆ సంస్థ ఎండీ ద్వారాకా తిరుమల రావు గుడ్ న్యూస్ చెప్పారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆర్టీసీపై పెను ప్రభావం పడింది. బస్సు సర్వీసులు లేక ఆర్టీసీ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి తేరుకుంటోంది. దీంతో రెగ్యులర్ అంశాలు పెండింగ్ లో ఉన్న ఇష్యూలపై అధికారులు ఫోకస్ చేశారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ఆ సంస్థ ఎండి ద్వారకా తిరుమల రావు చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన వారి పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ముందు చెప్పిన హామీలో భాగంగా తిరుపతిలో మొదటి విడతగా 100 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన నడపనున్నామని చెప్పిన ఆయన, తిరుపతిలో విజయవంతమైతే విశాఖ, కాకినాడ, గుంటూరులో కూడా ఈ తరహా బస్సులను ఎండీ ప్రవేశ పెడతామన్నారు.